చరిత్ర సృష్టించిన సైనా, సింధు
చరిత్ర సృష్టించిన సైనా, సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు చరిత్ర సృష్టించారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లలో వీరిద్దరూ విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. ఈ విజయాలతో వీరిద్దరూ పతకాలను ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో అద్భుత విజయం సాధించిన సింధు సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ సన్‌ యూపై ఆధిపత్యం ప్రదర్శించి 21-14, 21-9 తేడాతో విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ప్రత్యర్థి పుంజుకునేందుకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిన సింధు ముందు సన్‌యూ నిలవలేకపోయింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇది ఆమెకు మూడో పతకం కానుండటం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌ కూడా సింధునే. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఇక క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌.. స్కాట్లాండ్‌ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగే సెమీస్‌ల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్‌లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.

Posted On 26th August 2017

Source eenadu