మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ అనంతరం భారత్-శ్రీలంక మధ్య ఈ నెల 20 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. టెస్టు సిరీస్లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. వన్డేల్లో తలపడే భారత జట్టును ఆదివారం ప్రకటిస్తామని బీసీసీఐ తెలిసింది.
టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, కేదార్ జాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించి శ్రీలంక పర్యటనకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ధోనీ.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో శిక్షణ అనంతరం సహచరులతో కలిసి దిగిన ఫొటోని తన ఇన్స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఎన్సీఏ అన్ని పరీక్షలు అయిపోయాయి. 20మీటర్ల పరుగును 2.91సెక్లన్లలో ముగించాను. భారీ భోజనానికి సమయమైంది’ అని పేర్కొన్నాడు.
ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్కి జడేజా, అశ్విన్, కోహ్లీ, మహ్మద్ షమికి బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. అయితే కోహ్లీ వన్డే సిరీస్లో ఆడాలనుకుంటున్నాడట. వన్డే సిరీస్లో ఎవరు చోటు దక్కించుకున్నారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. రైనా చివరి వన్డేని 2015 అక్టోబరులో దక్షిణాఫ్రికాపై ఆడాడు.
Posted On 12th August 2017