ఎన్టీఆర్, రామ్చరణ్ లు కథానాయికులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #RRR. ఈచిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్ లకు జోడీగా అలియా భట్, డైసీ ఎడ్గార్జోన్స్ లు నటించనున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు అజయ్దేవగణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే, ఈ చిత్రం నుంచి కథానాయిక డైసీ ఎడ్గార్జోన్స్ తప్పుకొన్నారు. ‘‘అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్ జోన్స్ #RRR లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాం’’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది.
కాగా గుజరాత్ షెడ్యూల్ను సరైన సమయంలో పూర్తి చేసినట్లు దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు. "ఆటంకాలు ఎదురైనప్పటికీ గుజరాత్ షెడ్యూల్ను సరైన సమయంలోనే పూర్తిచేయడం జరిగింది. షూటింగ్ సమయంలో ధర్మజ్, సిద్ధపూర్ ప్రజలు చూపించిన ఆదరణ, ఆతిథ్యానికి కృతజ్ఞతలు. ఉగాదికి ఇంటికి వచ్చాం" అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఇదే టైంలో రామ్చరణ్ జిమ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది.
Posted On 8th April 2019