ఏమో ఏమో ఏంటో.. ఏమయ్యిందో ఏమో ఏంటో..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలోని నాలుగో పాట విడుదలైంది. ‘ఏమో ఏమో ఏంటో.. ఏమయ్యిందో ఏమో ఏంటో.. ముళ్లతీగ మీద మల్లె పూసేసిందేంటో..’ అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. విడుదలైన 20 నిమిషాల్లోనే 50 వేల వ్యూస్‌, 10 వేలకుపైగా లైక్‌లు సొంతం చేసుకుంది.

డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted On 17th March 2017

Source eenadu