రామ్ కథానాయకుడుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. చిత్ర బృందం పూజా కార్యక్రమంలో పాల్గొంది. రామ్ ఈ సందర్భంగా తీసిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. అనంతరం యూట్యూబ్లో అభిమానులు పెట్టిన కామెంట్స్కు బదులిచ్చారు. మలయాళీ నటి అనుపమ పరమేశ్వరన్, తమిళ నటి మేఘ ఆకాశ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్లో ‘హైపర్’ చిత్రంతో రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన ‘నేను-శైలజ’ చిత్రం విజయం అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Posted On 29th March 2017