కావల్సినవి:
పాలు - ఒకటింబావు కప్పు,
బాగా చిక్కగా మరిగించిన పాలు - పావుకప్పు,
చక్కెర - పావుకప్పు,
మొక్కజొన్నపిండి - చెంచా,
మామిడిగుజ్జు - అరకప్పు,
యాలకులపొడి - పావుచెంచా.
తయారీ: ఓ గిన్నెలో పాలు, చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి సగం అయ్యాక మొక్కజొన్న పిండి కలపాలి. ఇవి మరిగాక చిక్కగా మరిగించిన పాలను పోసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాలయ్యక యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు ఈ పాల మిశ్రమం, మామిడిపండు గుజ్జు తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. దీన్ని కుల్ఫీ పాత్రలో తీసుకుని ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో ఉంచి తీసేయాలి.
Posted On 18th April 2017