అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’. హరీశ్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రంలో ‘డీజే శరణం.. భజే భజే..’ అంటూ సాగే ఈ పాటను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను విజయ్ ప్రకాశ్ ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ‘డీజే’ను నిర్మిస్తున్నారు.వెన్నెల కిషోర్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్లో ‘డీజే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Source: ఈనాడు
Posted On 22nd May 2017