‘పబ్బుల్లో వాయించే డీజేను కాదురా.. పగిలిపోయేలా వాయించే డీజేను’ అంటున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’. హరీష్ శంకర్ దర్శకుడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులో బన్ని పవర్ఫుల్ డైలాగ్లు చెబుతూ కనిపించారు. ‘ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సర్..! యుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ సాగే టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఒక వైపు బ్రాహ్మణ యువకుడి గెటప్లో, మరోవైపు సూట్లో బన్ని పాత్రను ఆసక్తికరంగా చూపించారు.
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తున్నారు. జూన్ 23న ‘డీజే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Posted On 6th June 2017