దెయ్యాలు మనుషుల్ని భయపెట్టడం సాధారణం. కానీ మనుషులు దెయ్యాన్ని భయపెడితే.. ప్రత్యేకం కదా. ఇప్పుడు ఇలాంటి కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న చిత్రమే ‘ఆనందో బ్రహ్మ’. తాప్సి, శ్రీనివాస్రెడ్డి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేశ్, షకలక శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ‘తాతా తాతా.. నిద్ర రావట్లేదు తాత.. ఒక కథ చెప్పవా’ అంటూ ఓ చిన్నారి మాటలతో ప్రారంభమైన ఈ ట్రైలర్ను హాస్యభరితంగా చూపించారు.
మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మాతలు. కె స్వరాలు అందిస్తున్నారు. ఆగస్టు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Posted On 19th July 2017