మనుషులు దెయ్యాన్ని భయపెడితే... ‘ఆనందో బ్రహ్మ’ ట్రైలర్‌

దెయ్యాలు మనుషుల్ని భయపెట్టడం సాధారణం. కానీ మనుషులు దెయ్యాన్ని భయపెడితే.. ప్రత్యేకం కదా. ఇప్పుడు ఇలాంటి కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న చిత్రమే ‘ఆనందో బ్రహ్మ’. తాప్సి, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్‌, తాగుబోతు రమేశ్‌, షకలక శంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘తాతా తాతా.. నిద్ర రావట్లేదు తాత.. ఒక కథ చెప్పవా’ అంటూ ఓ చిన్నారి మాటలతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ను హాస్యభరితంగా చూపించారు.

మహి వి రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మాతలు. కె స్వరాలు అందిస్తున్నారు. ఆగస్టు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Posted On 19th July 2017

Source eenadu