మొబైల్ లో గేమ్స్ ఎక్కువగా ఆడడం వల్ల కంటిచూపు దెబ్బతిందని... స్మార్ట్ ఫోన్ చేతుల్లో కూడా పెట్టుకోవద్దని డాక్టర్ వార్నింగ్ ఇచ్చారని, అందువల్లే ట్విట్టర్ లో ఉండలేకపోతున్నానని నటి కాజల్ అభిమానులకు వెల్లడించింది. ఈ విషయంలో తన అభిమానులు కూడా జాగ్రత్త గా ఉండాలని ఆవిడా సూచించారు.
తమిళ ‘బిగ్బాస్’ సీజన్ 1 ద్వారా పాపులర్ అయ్యి, చాల తమిళ చిత్రాల్లో నటిస్తున్న కాజల్ పశుపతి ఇంతకుముందు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ ఉండేవారు. అయితే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా లేకపోవడం తో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించించారు.
Posted On 29th December 2018