జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జై లవకుశ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కొరియాలో నిర్వహించిన ‘బుచాన్ ఇంటర్నేషనల్ ఫెన్టాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్’(BIFFF)లో ఉత్తమ ఆసియా చిత్రాలు (Best of Asia) విభాగంలో శనివారం ఉదయం ఈ సినిమాను ప్రదర్శించారు. BIFF లో స్థానం సంపాదించుకున్న తెలుగు సినిమాగా ఈ సినిమా మరో ఘనత సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయకలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు.
Posted On 21st July 2018