ప్రస్తుతం యువతలో ఉన్న సెల్ఫీ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ వీవో ‘వీ5ఎస్’ పేరుతో సరికొత్త మొబైల్ను విపణిలోకి విడుదల చేసింది. ముందు 20 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం ఈ ఫోను ప్రత్యేకత. దీని ధర రూ.18,990గా నిర్ణయించారు. మే 6వ తేదీ నుంచి అన్ని రిటైల్ స్టోర్లతో పాటు ఫ్లిప్కార్ట్లో ఈ ఫోను అందుబాటులోకి రానుంది.
‘పరిమిత సంఖ్యలో వీవో వీ5ప్లస్ను విడుదల తర్వాత ఇప్పుడు మిమ్మల్ని థ్రిల్కు గురిచేసే మరో ఫోన్తో మీ ముందుకు వస్తున్నాం. ఉత్తమమైన సెల్ఫీ కెమేరా ఫోన్గా మార్కెట్ను సుస్థిరం చేసుకోవడమే మా లక్ష్యం’ అని వీవో ఇండియా సీఈవో కెంట్ ఛెంగ్ తెలిపారు.
వీవో వీ5ఎస్ ప్రత్యేకతలు
* 5.5 అంగుళాల తాకే తెర
* 20 మెగా పిక్సెల్ ముందు కెమేరా
* 13 మెగా పిక్సెల్ వెనుక కెమేరా
* 4 జీబీ ర్యామ్
* 64 జీబీ అంతర్గత మెమొరీ
* 256 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే సామర్థ్యం
* 64బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ మార్ష్మాలో
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
Posted On 27th April 2017