ప్రస్తుతం టెలికాం సంస్థల మధ్య డేటా వార్ నడుస్తున్న నేపథ్యంలో ఎయిర్టెల్ తన వినియోగదారులకు మరో భారీ ఆఫర్ తీసుకొచ్చింది. వచ్చే మూడు నెలల పాటు తన పోస్ట్పెయిడ్ చందాదారులకు ఉచిత డేటాను అందించనున్నట్లు తెలిపింది. ‘మై ఎయిర్టెల్’ యాప్ను లాగిన్ కావడం ద్వారా నెలకు 10జీబీ చొప్పున మూడు నెలల పాటు 30జీబీ డేటాను పొందవచ్చు. ‘వచ్చే మూడు నెలలు ఉచిత డేటాను ఆనందించండి. మీరు ఏదైనా దూర ప్రయాణానికి వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటే అందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ చందాదారులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు.
Posted On 17th April 2017