జియో మ‌రో సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న‌.. 100% క్యాష్‌బ్యాక్‌
జియో మ‌రో సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న‌.. 100% క్యాష్‌బ్యాక్‌

రిల‌య‌న్స్ జియో మ‌రో బ్ర‌హ్మాండ‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. జియోఫై4జి రూట‌ర్‌తో వంద‌శాతం క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్ర‌త్య‌ర్థి టెల్కోలు ఆఫ‌ర్ చేస్తున్న డాంగిల్స్‌, డేటాకార్డ్స్‌ను జియో వైఫై 4జీ రూట‌ర్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్న‌ట్టు పేర్కొంది. రెండు ప్లాన్స్‌తో ముందుకొచ్చిన జియో మొద‌టి ప్లాన్‌లో భాగంగా డేటాకార్డ్‌, డాంగిల్‌, హాట్‌స్పాట్ రూట‌ర్‌ను జియో డిజిట‌ల్ స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే వంద‌శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వ‌నుండ‌గా డివైజ్‌ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.2010 విలువైన 4జీ డేటాను ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొంది. అయితే జియో ఫై రూట‌ర్ కోసం వినియోగ‌దారులు రూ.1999 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక దీంతోపాటు రూ.399 ప్లాన్ కింద తొలిసారి రూ.408తో రీచార్జ్ చేసుకోవాలి. అలాగే రూ.99 జియో ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకుని ఉండాలి. వినియోగ‌దారులు రూట‌ర్ కోసం రూ.1999 చెల్లిస్తే రూ.2010 విలువైన 4జీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. అంటే వినియోగ‌దారుల‌కు ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉచిత‌మ‌న్న మాట‌.

రెండో ప్లాన్ కింద యూజ‌ర్లు త‌మ డేటా క‌నెక్ష‌న్లు ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాల్స‌న అవ‌స‌రం లేదు. అయితే రూ.408తో మొద‌టి రీచార్జ్ చేయించుకుంటే రూ.1999కే జియోఫై అందుబాటులోకి వ‌స్తుంది. అయితే ఈ ఆఫ‌ర్‌లో కేవ‌లం రూ.1005 విలువైన 4జీ డేటా మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. జియో తాజా ప్లాన్ల‌తో ఇప్ప‌టికే ఇత‌ర టెల్కోల డాంగిల్స్‌, డేటాకార్డులు వాడుతున్న‌వారు జియో వైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Posted On 6th May 2017

Source andhrajyothi