ఫెయిల్‌ అయ్యారా.. మీకు నేనున్నా
ఫెయిల్‌ అయ్యారా.. మీకు నేనున్నా

ఆదివారం పన్నెండో తరగతి సీబీఎస్‌సీ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్‌ అయినా తాను సాయం చేస్తానని అంటున్నాడు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

‘‘పన్నెండో తరగతి సీబీఎస్‌సీ ఫలితాలు విడుదలయ్యాయని తెలిసింది. అయితే మీలో ఎవరైనా పాస్‌ అవ్వకపోయినా, మార్కులు తక్కువగా వచ్చినా బాధపడకండి. అది పెద్ద తప్పేమీ లేదు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జీవితం చాలా అందమైనది. ఇంకా జయించాల్సింది ఎంతో ఉంది. నా స్నేహితుల్లోనే చాలా మంది పదో తరగతి, ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన వాళ్లున్నారు. అయినా వాళ్లు కెరీర్‌లో సక్సెస్‌ అయ్యారు. అలాంటప్పుడు మీరెందుకు కాకూడదు. కాబట్టి మీ స్నేహితులతో, తల్లిదండ్రులతో, నాతో మీ అభిప్రాయాలు పంచుకోండి. మీరు నాకు ఎప్పుడైనా మెసేజ్‌ చేయచ్చు. మీకు నేనున్నాను. నేను సాయం చేస్తాను. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది. ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి .’ అంటూ వీడియోలో పేర్కొన్నాడు రాజ్‌కుమార్‌ రావ్‌.

Posted On 29th May 2017

Source eenadu