తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ- ‘అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎటిఎంఏ)పథకం కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 23
కాంట్రాక్ట్ కాలవ్యవధి: 2017 మార్చి 31 వరకు
వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: (పీజీ/ డిగ్రీ/ డిప్లొమా)(అగ్రికల్చర్/ హార్టి కల్చర్/ ఫిషరీస్/ వెటర్నరీ)కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీ/ డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఫీల్డు అనుభవం, ఏరియా స్పెషలైజేషన్, కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో నింపిన దరఖాస్తుఫారం కాపీని కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 3
చిరునామా: పథక సంచాలకులు, ఆత్మ, డోర్ నెం. 70 - 10 - 8/4, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టిఒ ఆఫీసు వద్ద, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా- 533003
వెబ్సైట్: eastgodavari.nic.in
Posted On 3rd October 2016
Source