గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్

అరుంధతి సినిమా ద్వారా తెలుగు తెరపై తనదంటూ ఒక ముద్ర వేసుకున్న సోనూసూద్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మధ్యే హెల్త్ వర్కర్స్ కి ఉచితంగా ఆహారం అందివ్వడానికి ప్రభత్వ అనుమతితో తన హోటల్ ను ఓపెన్ చేసారు. దాని ద్వారా సరైన ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న ఎంతోమంది హెల్త్ వర్కర్స్ కి ఆహారం అందిస్తున్నారు.

దానితో ఆగిపోలేదు, ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టుకున్నారు. దాదాపు 45 వేల మందికి భోజనం అందివ్వడానికి ముందుకొచ్చారు. ముంబై కార్పొరేషన్ తో జత కలిసి ముంబై లోని కొన్ని ప్రాంతాల్లో 45 వేల మందికి ఆహారం అందిస్తున్నారు. చాలామంది సినిమా నటులు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించారు. కొంతమనదైతే ఏకంగా కోట్లలో ప్రకటించారు. కానీ పేదల సహాయార్ధం స్వయంగా రంగలోకి దిగిపోయారు సోనూసూద్. ఈ విషయంలో మిగిలిన సినీ తారలు కూడా సోనూ సూద్ ని ఆదర్శంగా తీసుకుంటే బావుంటుందేమో.

Posted On 11th April 2020