మే 3 వ తేదీ వరకు ఉన్న లాక్డౌన్ ను మరో మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈనెల 4 నుంచి 17వ తేదీ వరకూ లాక్డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్ - 2005 కింద రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రిత్వా శాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రెడ్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఉంటాయి.
విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, టాక్సీలు, క్యాబ్లు,ఆటో రిక్షాలు, రిక్షాలు, తిరగవు. స్పా, సెలూన్లు ఓపెన్ చేయరాదు. అంతర్ జిల్లా, రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది.
Posted On 1st May 2020