సత్తుపల్లి చైర్మన్ రేస్ లో... సండ్ర అనుచరుడు
సత్తుపల్లి చైర్మన్ రేస్ లో... సండ్ర అనుచరుడు

సత్తుపల్లి మున్సిపాలిటీ లో రిజర్వేషన్ స్థానం జనరల్ కేటాయించి బడితే సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి ముఖ్య అనుచరుడు కుసంపూడి మహేష్ కి కి చైర్ పర్సన్ స్థానం కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత సత్తుపల్లిలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అందరు నేతలు టిడిపిని వీడి అధికార పార్టీలో చేరారు. కానీ ఆ సమయంలో కూడా ఎమ్మెల్యేను నమ్ముకుని కూసంపూడి మహేష్, ఆయన అనుచరులు టిడిపి పార్టీలోనే కొనసాగారు.

2014, 2019 ఎన్నికల్లో మరియు ఎన్నికల తర్వాత కూడా సండ్రనే నమ్ముకుని ఉన్నారు. అంతేకాకుండా సండ్ర కు అత్యంత సన్నిహితంగా మెలిగే మహేష్ పై సత్తుపల్లి ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉంది. నిత్యం ప్రజల్లో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే మహేష్ చైర్మన్ అయితే సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.

Posted On 9th July 2019