మళ్ళీ జనంలోకి... జనసేనాని
మళ్ళీ జనంలోకి... జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. ఆంధ్ర ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంపైనా చర్చించారు. పార్టీ శ్రేణులలో స్థైర్యాన్ని పెంపొందించాలని, యువ నాయకత్వం బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేయాలని కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క పని తీరు, హామీలు, పథకాల అమలులో వైఫల్యాలు, విద్యుత్ సంక్షోభం, వ్యవసాయ సమస్యలు, ప్రతిపక్షాలపై మరియు జనసేన నేతలపై అధికార పక్షం చేస్తున్న దాడులపై చర్చించారు.

ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో ర్యాలీ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబర్ 3న జరిగే ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Posted On 20th October 2019