ఆంధ్రప్రదేశ్ లో 87 మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో 87 మందికి కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఇవ్వాళ ఒక్కరోజులో 43 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం రా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈ 12 గంటల వ్యవధిలో 373 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 330 నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు పేర్కొంది.

Posted On 1st April 2020